KTR Demands On Health Emergency : రాష్ట్రంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డెంగీ మరణాలు లేవని ప్రభుత్వం అంటోందన్న ఆయన, మొన్న ఐదుగురు, ఇవాళ ముగ్గురు డెంగీతో మరణించారని మీడియాలో కథనాలు వస్తున్నాయని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సమాచారాన్ని ఎవరు, ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించాలి : కేటీఆర్
Published : Aug 26, 2024, 1:10 PM IST
KTR Demands On Health Emergency (ETV Bharat)
ఆసుపత్రుల్లో తగిన ఔషధాలు లేవని, చాలా ఆసుపత్రుల్లో ఒక్కో బెడ్పై ముగ్గురు, నలుగురు ఉంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. సమస్య తీవ్రతను అంగీకరించాలని, రాష్ట్రంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు.