national

సీబీఐ ఛార్జ్‌షీట్‌పై విచారణ వచ్చేనెల 11కు వాయిదా - హైదరాబాద్‌కు కవిత

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2024, 2:56 PM IST

BRS Kavitha CBI Chargesheet Inquiry
BRS Kavitha CBI Chargesheet Inquiry (ETV Bharat)

BRS Kavitha CBI Chargesheet Inquiry :దిల్లీ మద్యం కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణకు వర్చువల్‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. డిఫెన్స్ లాయర్లు కోరుతున్న పత్రాలను సెప్టెంబరు 4వ తేదీలోపు ఇవ్వాలని ఆదేశించారు. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో కొన్ని పత్రాలు సరిగా లేవని కవిత తరఫు లాయర్లు తెలిపారు. నాణ్యమైన పత్రాలు ఇవ్వాలని కోరారు. దీంతో సీబీఐ ఛార్జ్‌షీట్‌పై విచారణను ట్రయల్‌ కోర్టు సెప్టెంబరు 11కు వాయిదా వేసింది. విచారణ అనంతరం కవిత దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. కాసేపట్లో ఆమె, కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు రానున్నారు.

ABOUT THE AUTHOR

...view details