స్టేజ్పైనే తెలుగు నిర్మాత పాదాలు తాకిన అమితాబ్!
Published : Jun 20, 2024, 9:53 AM IST
![స్టేజ్పైనే తెలుగు నిర్మాత పాదాలు తాకిన అమితాబ్! source ANI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-06-2024/1200-675-21751396-376-21751396-1718856774576.jpg)
Kalki 2898 AD Pre Release Event AmitabhBachan producer AshwiniDutt : కల్కి ప్రీరిలీజ్ ఈవెంట్ ముంబయిలో గ్రాండ్గా జరిగింది. ఈ ఈవెంట్కు అమితాబ్బచ్చన్, కమల్హాసన్, దీపికాపదుకొణె, ప్రభాస్తో పాటు నిర్మాత అశ్వినీదత్ హాజరయ్యారు. రానా హోస్ట్గా వ్యవహరించారు. అయితే ఈ ఈవెంట్లో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అశ్వినీదత్ పాదాలను తాకబోయారు అమితాబ్. అశ్వినీదత్ లాంటి నిర్మాతను తాను ఎప్పుడూ చూడలేదని, సెట్లో తమను బాగా చూసుకున్నారని ప్రశంసలు కురిపించారు. అనంతరం అశ్వినీదత్ కూడా రియాక్టై అమితాబ్ పాదాలను తాకబోయారు. ఈ ఆసక్తికరమైన దృశ్యం బాగా వైరల్గా మారింది. ఇకపోతే కల్కి సినిమా అద్భుతంగా ఉంటుందని, ఇలాంటి సినిమాలో భాగమవ్వడం గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారు అమితాబ్. బిగ్ టికెట్ లాంఛ్ చేసిన తర్వాత దానిని కొనుగోలు చేసి కమల్హాసన్కు గిఫ్ట్గా ఇచ్చారు. కాగా, సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇప్పటికే టికెట్లు హాట్కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.