తెలంగాణ

telangana

ఎన్నేళ్లైనా దాన్ని అస్సలు మర్చిపోలేను : రాశీ ఖన్నా

By ETV Bharat Telugu Team

Published : Jun 25, 2024, 8:43 AM IST

source ETV Bharat
Raashi Khanna (source ETV Bharat)

Raashikhanna completed 10 Years : సొట్ట బుగ్గల సుందరి రాశీఖన్నా తెలుగు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయిపోయింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు ప్రస్తుతం "తెలుసు కదా" అనే చిత్రంలో నటిస్తోంది. అయితే ఈ పదేళ్ల తన సినీప్రస్థానం గురించి గుర్తుచేసుకుంటూ సంబరపడిపోయింది రాశీ. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా ప్రస్తావిస్తూ "నేను టాలీవుడ్​లో అడుగుపెట్టి పదేళ్లు అయిపోయిందంటే నమ్మలేకపోతున్నాను. సినీఅభిమానుల ప్రేమను రుచి చూసింది టాలీవుడ్‌లోనే. నా తొలి సినిమా అయిన 'ఊహలు గుసగుసలాడే' చిత్రాన్ని చేసే సమయంలో నాకు ఈ భాష రాదు, సంస్కృతి తెలియదు. కానీ, నన్ను ఆదరించారు. ఆ సినిమాకు వచ్చిన ప్రశంసలు కూడా మర్చిపోలేను. ఇక్కడ పని చేయడం నాకు చాలా కంఫర్ట్ ఇస్తుంది. నా టాలెంట్ నమ్మి నాకు అవకాశాలు ఇస్తున్న డైరక్టర్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకుల అభిమానం వెలకట్టలేనిది" అని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details