national

అంబానీ పెళ్లి వేడుకలకు ప్రధాని మోదీ- వధూవరులకు 'శుభ ఆశీర్వాద్​'

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 7:04 AM IST

anant ambani wedding
anant ambani wedding (ETV Bharat)

Modi Attend Ambani Wedding : రిలయన్స్‌ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధికాల పెళ్లి వేడుకల్లో రెండో రోజైన శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ అతిరథ మహారథులు తరలివచ్చి నూతన వధూవరులకు శుభ్ అశీర్వాద్‌ అందించారు. జియో కన్వెన్షన్‌ సెంటర్‌కు విచ్చేసిన ప్రధానికి, ముకేశ్‌ దంపతులు ఎదురేగి స్వాగతం పలికారు. నూతన వధూవరులను ప్రధాని మోదీ అశీర్వాదం ఇచ్చారు. ఈ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, బంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఏక్‌ నాథ్‌ శిందే పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ప్రముఖ గాయకులు శంకర్‌ మహాదేవన్‌, శ్రేయా ఘోషల్‌ చేసిన సంగీత కచేరీ ప్రత్యేత ఆకర్షణగా నిలిచింది.

ABOUT THE AUTHOR

...view details