national

ETV Bharat / snippets

బీజేపీ తరఫున ప్రచారం చేస్తా- కానీ ఓ షరతు: కేజ్రీవాల్

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Updated : 4 hours ago

Kejriwal On Bjp
Kejriwal On Bjp (ETV Bharat)

Kejriwal On BJP :దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్‌ అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్‌ సవాల్‌ విసిరారు. ఒకవేళ ఉచిత విద్యుత్ అందిస్తే తాను బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారు. దిల్లీలో ఆదివారం జరిగిన జనతా కీ అదాలత్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, బీజేపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ, ఎక్కడైనా ఉచిత విద్యుత్‌ ఇచ్చిందా అని ప్రశ్నించారు.

డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం అంటే అధిక ధరలు, నిరుద్యోగం, అవినీతి అని ప్రజలకు అర్థమైందని కేజ్రీవాల్ విమర్శించారు. అందుకే హరియాణా, జమ్ముకశ్మీర్‌లో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఓడిపోతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయని అన్నారు. డబుల్ ఇంజిన్​లో ఒక ఇంజిన్‌ జూన్‌లోనే పాడైందని, ఇప్పుడు రెండోది మెల్లగా విఫలమవుతుందని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details