యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం - డబుల్ డెక్కర్ బస్సు, కారు ఢీ - ఏడుగురు మృతి
Published : Aug 4, 2024, 8:23 AM IST
UP Accident 7 Killed :ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా-లఖ్నవూ ఎక్స్ప్రెస్ వేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డబుల్ డెక్కర్ బస్సు, ఓ కారును ఢీకొనడంతో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. "రాయ్బరేలీ నుంచి దిల్లీ వెళ్తున్న బస్సు రాత్రి సుమారుగా 12.45 గంటల సమయంలో, ఓ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని నలుగురు, కారులోని ముగ్గురు వ్యక్తులు మరణించారు. గాయపడిన వారికి సమీపంలోని ఆసుపత్రికి తరలించాం. ప్రమాదంలో చిక్కుకున్న కారు లఖ్నవూ నుంచి ఆగ్రాకు వస్తోంది. అయితే కారు డ్రైవర్ నిద్ర మత్తులో రాంగ్ రూట్లోకి రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది" అని పోలీసులు తెలిపారు.