national

టూరిస్ట్​ల బస్సుకు ప్రమాదం- 11మంది దుర్మరణం- మరోఘటనలో 26మంది బలి!

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2024, 2:53 PM IST

Bus Accidents In Pakistan
Bus Accidents In Pakistan (ETV Bharat)

Bus Accidents In Pakistan : పాకిస్థాన్‌లో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు బస్సు ప్రమాదాల్లో 37 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరాన్ నుంచి షియా యాత్రికులతో వస్తున్న బస్సు బలూచిస్థాన్​లోని మక్రాన్ కోస్టల్ హైవేపై అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో జరిగిన మరో బస్సు ప్రమాదం జరిగింది. 35 మందితో ప్రయాణిస్తున్న బస్సు కాలువలో పడింది. ఈ ప్రమాదంలో 26 మంది మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు, పురుషులు ఉన్నారని, వీరంతా ఆక్రమిత కశ్మీర్‌లో సుధానోతి జిల్లాకు చెందిన వారని పోలీసులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details