Bus Accidents In Pakistan : పాకిస్థాన్లో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు బస్సు ప్రమాదాల్లో 37 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరాన్ నుంచి షియా యాత్రికులతో వస్తున్న బస్సు బలూచిస్థాన్లోని మక్రాన్ కోస్టల్ హైవేపై అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
టూరిస్ట్ల బస్సుకు ప్రమాదం- 11మంది దుర్మరణం- మరోఘటనలో 26మంది బలి!
Published : Aug 25, 2024, 2:53 PM IST
Bus Accidents In Pakistan (ETV Bharat)
మరోవైపు, పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరిగిన మరో బస్సు ప్రమాదం జరిగింది. 35 మందితో ప్రయాణిస్తున్న బస్సు కాలువలో పడింది. ఈ ప్రమాదంలో 26 మంది మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు, పురుషులు ఉన్నారని, వీరంతా ఆక్రమిత కశ్మీర్లో సుధానోతి జిల్లాకు చెందిన వారని పోలీసులు వెల్లడించారు.