ఓనం వేడుకల్లో విషాదం! గొంతులో ఇడ్లీ ఇరుక్కుని వ్యక్తి మృతి
Published : Sep 14, 2024, 9:29 PM IST
Man Dies During Idli Eating Competition : కేరళ కంచికోడ్లో ఇడ్లీ తినే పోటీలో పాల్గొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఓనం వేడుకల్లో భాగంగా కొల్లాపురలో యువజన సంఘం ఆధ్వర్యంలో ఇడ్లీలు తినే పోటీని నిర్వహించారు. ఈ పోటీలో అలమరానికి చెందిన సురేశ్ (50) అనే వ్యక్తి పాల్గొన్నారు. పోటీలో భాగంగా ఇడ్లీలు వేగంగా తింటుండగా, అది గొంతులో ఇరుక్కుపోయింది. నిర్వాహకులకు వెంటనే ఈ విషయం తెలియజేశాడు. దీంతో వాళ్లు సురేష్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, సురేశ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. మృతుడు లారీ డ్రైవర్గా పని చేస్తుంటాడు.