ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు- 21మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్
Published : 20 hours ago
Jharkhand Polls Congress First List :ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ 21మంది పేర్లతో తొలిజాబితా విడుదల చేసింది. ఆర్థిక మంత్రి రామేశ్వర్ ఓరాన్ లోహర్దగా నుంచి బరిలో ఉన్నారు. సీనియర్ నేత, త్రిపుర, ఒడిశా, నాగాలాండ్ ఇన్ఛార్జ్ అజోయ్ కుమార్ జంషెడ్పూర్ తూర్పు నుంచి పోటీ చేస్తున్నారు. ఝార్ఖండ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ ఓరాన్, షిప్లి నేహా టిర్కీ మందార్ పేర్లు తొలిజాబితాలో ఉన్నాయి. 81 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఝార్ఖండ్కు నవంబర్ 13, 20 తేదీల్లో పోలింగ్, 23న ఫలితాలు వెల్లడికానున్నాయి. మరోవైపు ఝార్ఖండ్లో కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ, వామపక్షాలు సీట్ల సర్దుబాటుపై అవగాహనకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ 29, జేఎంఎం 41, ఆర్డేజీ 7, లెఫ్ట్ పార్టీలు 4 స్థానాల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.