మధ్యప్రదేశ్లో కూలిన 400 ఏళ్ల నాటి గోడ- ఏడుగురు మృతి
Published : Sep 12, 2024, 3:26 PM IST
400 Year Old Wall Collapsed : మధ్యప్రదేశ్లోని దతియా పట్టణంలో 400 వందల ఏళ్లనాటి గోడకూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. బుధవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోడ కూలింది. ఖల్కాపురా ప్రాంతంలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఆ సమయంలో శిథిలాల కింద తొమ్మిది మంది చిక్కుకున్నారు. వారిలో ఏడుగురు మృతి చెందగా, ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. కలెక్టర్ సందీప్ మాకిన్ పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.