ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఏ ముఖం పెట్టుకుని వచ్చారు - వైఎస్సార్సీపీ నేతలను నిలదీసిన మహిళలు - Women Questioned YSRCP Leader - WOMEN QUESTIONED YSRCP LEADER

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 10, 2024, 8:39 PM IST

Women Questioned YSRCP Leader About Water: ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన వైఎస్సార్సీపీ అభ్యర్థికి చుక్కెదురైంది. తాగునీటి సమస్య గురించి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని స్థానిక మహిళలు నిలదీశారు. గత ఎమ్మెల్యే డాక్టర్ జలదొడ్డి సుధాకర్ గ్రామంలో ఇంటింటికి కుళాయిని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

YSRCP Leader in Election Campaign At Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సి. బెళగల్ మండలం చెరువు పల్లె గ్రామంలో ప్రచారం కోసం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్, చైర్మన్ కోట హర్షవర్ధన్ రెడ్డికి వెళ్లారు. ఏ ముఖం పెట్టుకుని మళ్లీ  ఓట్ల కోసం వచ్చారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి,  చైర్మన్​ను మహిళలు నిలదీశారు. దీంతో మహిళలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని వైఎస్సార్సీపీ నేతలు నీళ్లు నమిలారు. మహిళలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినకపోవటంతో వైఎస్సార్సీపీ నేతలు వెనుతిరిగారు.

ABOUT THE AUTHOR

...view details