ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అరుదైన అడవి దున్నలు- 150 ఏళ్ల తర్వాత మళ్లీ నల్లమలలో ప్రత్యక్షం - Wild Bisons Found at Atmakur Forest

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 2, 2024, 3:07 PM IST

అరుదైన అడవి దున్నలు- 150 ఏళ్ల తర్వాత మళ్లీ నల్లమలలో ప్రత్యక్షం (ETV Bharat)

Wild Bisons in Nandyal District : నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ ప్రాంతంలో అడవి దున్నలు సంచరించడం కలకలం రేపింది. శ్రీశైలం అభయారణ్యంలో సుమారు 150 ఏళ్ల తర్వాత మళ్లీ దున్నలు కనిపించడంతో అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అడవిదిన్నెలో ఇండియన్ బైనస్​గా ప్రసిద్ధి చెందిన ఈ దున్నలు నల్లమలలో విస్తారంగా సంచరించాయి. కాల క్రమేపి ఇవి అంతరించిపోయాయి. కర్ణాటక పశ్చిమ కనుమలకు మాత్రమే పరిమితమై ఉండే దున్నలు కిలో మీటర్లు దాటుకొని మళ్లీ నల్లమలలోకి ప్రవేశించడం అద్భుతంగా భావిస్తున్నామని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం దున్నల కదలికలను గమనిస్తున్నామని అటవీ అధికారులు తెలిపారు. మొదటి సారిగా ఇవి ఇక్కడి సిబ్బందికి కనిపించందన్నారు. ఇవి గుంపులో నుంచి తప్పి పోయి లేదా దారి తప్పి ఉండొచ్చని చెప్పారు. వీటిపై నిఘా ఉంచి సమాచారం సేకరిస్తున్నామని పేర్కొన్నారు. విస్తారమైన గడ్డి క్షేత్రాలు, రకరకాలైన వృక్షాలు ఉండటంతో వివిధ రకాల జంతువులు ఉన్నాయని, ఇప్పుడు అడవి దున్నలు రావడం అద్భుతంగా ఉందని అధికారులు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details