ఆంధ్రప్రదేశ్

andhra pradesh

LIVE: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ - ప్రత్యక్ష ప్రసారం - tirumala brahmotsavam 2024

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Published : 5 hours ago

Updated : 4 hours ago

LIVE: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. శుక్రవారం సాయంత్రం మీనా లగ్నంలో ధ్వజారోహణంతో వాహన సేవలు ప్రారంభమవుతాయి. అదే రోజు రాత్రి వాహనసేవాలు మొదలై తొమ్మిది రోజుల పాటు వివిధ వాహన సేవలపై మలయప్ప స్వామి అభయ ప్రధానం చేయనున్నారు. 12వ తేదీన చక్ర స్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి. రేపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి సీఎం చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు జిల్లా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. రేపటి నుంచి ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహన సేవలను భక్తుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అని ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రస్తుతం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి సేనాధిపతి అయిన విశ్వక్సేనులు వారు తిరుచ్చిపల్లకి పై ఊరేగుతూ ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. అర్చకులు పుట్టమన్ను, నవదాన్యాలను సేకరించి అంకురార్పణలో భాగంగా వైదిక కార్యక్రమాలను నిర్వహించి మొలకెత్తిస్తారు. ప్రత్యక్ష ప్రసారం.  
Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details