LIVE: అంబేడ్కర్ ఆశయాలకు దళిత ద్రోహి జగన్ రెడ్డి తూట్లు - ఎన్డీఏ నేతల మీడియా సమావేశం - NDA leaders on CM jagan - NDA LEADERS ON CM JAGAN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 14, 2024, 12:10 PM IST
|Updated : Apr 14, 2024, 12:44 PM IST
NDA Leaders Press Meet on CM Jagan: దళితుల అభివృద్ధికి తెలుగు దేశం పార్టీ అమలు చేసిన పథకాలేవీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయలేదని టీడీపీ నేతలు తెలిపారు. అంబేడ్కర్ ఆశయాలకు తూట్లు పొడిచిన దళిత ద్రోహి జగన్ రెడ్డి అని దుయ్యబట్టారు. ఎస్సీల సంక్షేమానికి జగన్ ఏమీ చేశాడో చెప్పుకోవడానికి ఒక్క పథకమైనా ఉందా అని ప్రశ్నించారు. ఏమన్నా అంటే బటన్ నొక్కానంటున్నారని, ప్రత్యేకంగా ఎస్సీల కోసం ఒక్క బటన్ అయినా నొక్కారా అని నిలదీశారు. జగన్ దళిత ద్రోహి అని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఎస్సీ నేతలదేనన్నారు. జగన్ ఫొటో ఉండాల్సింది ఇంటి తలుపుల మీద కాదు పోలీస్ స్టేషన్లోనన్నారు. లోకేశ్ జగన్ను తిడితే ఎస్సీలను తిట్టినట్టుగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. దళిత ద్రోహి జగన్ అనే విషయాన్ని బలంగా చెప్పాలని సూచించారు. దళిత సంక్షేమానికి మేనిఫెస్టోతో పాటు ప్రతి దళిత గడపకు లబ్ధి చేరేలా తెలుగుదేశం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్పై ఎన్టీఏ నేతల మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Apr 14, 2024, 12:44 PM IST