LIVE: కర్నూలు జిల్లా గూడూరులో చంద్రబాబు మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - Chandrababu Press Meet - CHANDRABABU PRESS MEET
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 29, 2024, 12:19 PM IST
|Updated : Apr 29, 2024, 12:47 PM IST
TDP Chief Chandrababu Press Meet Live: రాయలసీమలో 102 ఇరిగేషన్ ప్రాజెక్టులను రద్దు చేసిన దుర్మార్గుడు జగన్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. ఆర్డీఎస్ ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకూ నీళ్లు ఇవ్వలేదని కర్నూలు జిల్లా కౌతాళంలో నిర్వహించిన ప్రజాగళం సభలో మండిపడ్డారు. స్థానిక సంస్థలకు అధికారం ఇచ్చి వాటికి పూర్వవైభవం తెస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ నేతలు తుంగభద్ర పరిసరాల నుంచి ఇసుక, మట్టి దోపిడీ చేస్తున్నారన్న చంద్రబాబు అవినీతి పనులు చేసి సంపాదించిన వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు. జగన్ ప్యాలెస్ కొల్లగొడితే పేదల పొట్ట నిండుతుందని చంద్రబాబు అన్నారు. సామాజిక సమీకరణల ప్రకారం కర్నూలు జిల్లాలో టికెట్లు ఇచ్చామన్నారు. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎన్నికల్లో ఎన్డీయే కూటమి కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమలో 102 ప్రాజెక్టులను రద్దు చేసిన దుర్మార్గుడు సీఎం జగన్ అని మండిపడ్డారు. ఆర్డీఎస్ ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడుగు జీవుల రక్తం తాగే వ్యక్తులు బాలనాగిరెడ్డి, సాయిప్రతాప్రెడ్డి అని అన్నారు. సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్ధాలు చేసేవన్నీ మోసాలే అని విమర్శించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం.
Last Updated : Apr 29, 2024, 12:47 PM IST