ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విశ్రాంత జస్టిస్ ఎన్వీ రమణ - JUSTICE NV RAMANA VISITS TIRUMALA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 2, 2024, 1:13 PM IST

Retired Justice NV Ramana Visit in Tirumala Srivari Temple: తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి జస్టిస్‌ ఎన్వీ రమణకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలోకి వెళ్లిన ఎన్వీ రమణ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయం వెలుపలకు వచ్చిన ఎన్వీ రమణ శ్రీవారి ఆలయం ఎదుట బేడి ఆంజనేయస్వామి దర్శించుకొని అఖిలాండం వద్ద కొబ్బరికాయ సమర్పించారు. స్వామివారి దర్శనాంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు. 

శనివారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ బీవీఎల్ ఎన్వీ చక్రవర్తి శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సభ్యులతో ఆలయం వద్దకు చేరుకున్న వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం, అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

ABOUT THE AUTHOR

...view details