తెలంగాణ

telangana

LIVE : రాజ్యసభ సమావేశాలు - Rajya Sabha Sessions Live

By ETV Bharat Telangana Team

Published : Jul 31, 2024, 11:12 AM IST

Updated : Aug 1, 2024, 6:38 AM IST

Rajya Sabha Sessions Live (ETV Bharat)
Rajya Sabha Sessions Live : మూడో విడత మోదీ సర్కార్‌ లక్ష్యాలను వివరిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను పార్లమెంట్​లో ప్రవేశ పెట్టారు. వరుసగా ఏడోసారి వార్షిక పద్దును ప్రవేశపెట్టిన ఆమె వికసిత్‌ భారత్‌ లక్ష్యసాధనలో భాగంగా అన్ని రంగాల్లో ఉద్యోగ, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ మేరకు రూ. 48.21 లక్షల కోట్ల అంచనాలతో వార్షిక పద్దును ప్రవేశ పెట్టారు. ఈ వార్షిక బడ్జెట్​లో రెవెన్యూ రాబడులు 31.3లక్షల కోట్లుగా పేర్కొన్న ఆర్థిక మంత్రి, మూలధన రాబడులను రూ.16.9 లక్షల కోట్లుగా వివరించారు. రెవెన్యూ వ్యయాన్ని రూ.37.1 లక్షల కోట్లుగా వివరించిన మంత్రి మూలధన వ్యయం రూ.15లక్షల కోట్లు అని పేర్కొన్నారు. రెవెన్యూ లోటు జీడీపీలో 4.9 శాతంగా ఉంటుందని వివరించారు. కేంద్ర బడ్జెట్‌ ముఖ్య ఉద్దేశాన్ని దెబ్బతీశారని, చాలా రాష్ట్రాలకు నిధులు కేటాయించకుండా వివక్ష చూపారని విపక్ష నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి రాజ్యసభలో వాడివేడి చర్చ జరుగుతోంది. 
Last Updated : Aug 1, 2024, 6:38 AM IST

ABOUT THE AUTHOR

...view details