ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE : పిన్నమనేని & సీతాదేవి ఫౌండేషన్​ అవార్డ్స్​ ప్రత్యక్ష ప్రసారం - Pinnamaneni Awards Live

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 6, 2024, 6:58 PM IST

Updated : Mar 6, 2024, 7:21 PM IST

Pinnamaneni Seethadevi Foundation 30th Annual Awards Function Live : విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో డాక్టర్‍ పిన్నమనేని & శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్‌ 30వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. డాక్టర్‌ పిన్నమనేని అండ్‌ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్‌ ఛైర్మన్‌ చదలవాడ నాగేశ్వరరావు. 1950–1980 మధ్య కాలంలో విజయవాడలో వైద్య సేవలందించిన డాక్టర్‌ పిన్నమనేని వెంకటేశ్వరరావు సామాజిక బాధ్యతకూ చిరునామాగా నిలిచారని నాగేశ్వరరావు అన్నారు. వారు చూపిన విలువలు కొనసాగించడానికి ఫౌండేషన్‌ ఆధ్వర్యాన సామాజిక, కళారంగాలలో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు పురస్కారాలు అందిస్తున్నారు. నేడు శాస్త్రవేత్త, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్‌ ఎస్‌. సోమనాథ్‌కు పురస్కారాన్ని అందజేస్తున్నారు. సమావేశంలో ఫౌండేషన్‌ కోశాధికారి సూరెడ్డి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రముఖ వ్యవసాయశాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్‌.స్వామినాథన్‌కు విజయవాడతో అనుబంధం ఉంది. ఆయన 2011లో విజయవాడకు చెందిన డాక్టర్‌ పిన్నమనేని అండ్‌ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్‌ అవార్డు అందుకున్నారు. ఆ ఫౌండేషన్‌ 1989 నుంచి వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారి నుంచి ఒకరిని ఎంపిక చేసి, అవార్డు ఇచ్చేది. 2011లో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త తమిళనాడుకు చెందిన ఎం.ఎస్‌.స్వామినాథన్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు
Last Updated : Mar 6, 2024, 7:21 PM IST

ABOUT THE AUTHOR

...view details