ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 16, 2024, 9:18 AM IST

ETV Bharat / videos

వృద్ధురాలు దారుణ హత్య - పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన దుండగుడు - Old Woman Murdered

Old Woman Murdered in Proddatur : వైఎస్సార్​ జిల్లా ప్రొద్దుటూరులో బాలనాగమ్మ (65) అనే వృద్ధురాలు దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్‌ పోసి నిప్పు అంటించారు. దీంతో ఆమె గట్టిగా కేకలేస్తూ అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అప్పుటికే మృతి చెందిన బాలనాగమ్మ పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మూడు నెలల క్రితం నాగమ్మ కుమారుడు సురేశ్‌ ప్రేమ వివాహం చేసుకున్నాడు. కడపకు చెందిన నాగఉషతో చాపాడు మండలం అల్లాడుపల్లెలో పెళ్లి చేసుకున్నాడు. యువతి కుటుంబ సభ్యులు ఈ వివాహాన్ని అంగీకరించలేదు. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పెద్దల్ని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి యువతితో ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడటం మానేశారు. వీరి వివాహానికి సురేశ్​ తల్లి బాలనాగమ్మ సహకరించింది. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులే నాగమ్మను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details