LIVE: రాజాంలో నారా లోకేశ్ శంఖారావం బహిరంగ సభ - ప్రత్యక్ష ప్రసారం - Nara Lokesh Shankaravam Live
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 15, 2024, 11:27 AM IST
|Updated : Feb 15, 2024, 12:25 PM IST
Nara Lokesh Shankaravam at Rajam Live: నారా లోకేశ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శంఖారావం యాత్ర రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ అరాచకాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ లోకేశ్ యాత్రను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రాజాం నియోజకవర్గంలో లోకేశ్ శంఖారావం యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో ఎన్నికల సన్నద్ధతపై పార్టీ క్యాడర్కు లోకేశ్ దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ కేడర్తో లోకేశ్ ముఖాముఖిలు నిర్వహిస్తూ, సూపర్ - 6 కిట్లను అందజేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ కేడర్తో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని కార్యోన్ముఖులను చేయటంతో పాటు జగన్ పీడిత వర్గాలన్నింటికీ భరోసా కల్పించేలా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం యాత్రకు సిద్ధమైన విషయం తెలిసిందే. అధికార పార్టీ నేతల అరాచకాలను ఎండగడుతూ, తాము అధికారంలోకి రాగానే అభివృద్ధిని ఎలా పరుగులు పెట్టిస్తామనేది వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజాం నియోజకవర్గంలో నారా లోకేశ్ శంఖారావం యాత్ర ప్రత్యక్ష ప్రసారం మీకోసం.