ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 29, 2024, 9:23 PM IST

ETV Bharat / videos

చంద్రబాబు గెలిస్తే మాదిగలు గెలిచినట్టే : ఎమ్మార్పీఎస్ నాయకులు - mrps leader press meet

MRPS Leader Press Meet in Ongole : ఆంధ్రప్రదేశ్​లో మాదిగ జాతి ఆత్మగౌరవాన్ని, వారి మనుగడను కించపరిచే విధంగా జగన్ మోహాన్ రెడ్డి వ్యవహారిస్తున్నారని మాదిగ సంఘం నాయుకుడు నాగారాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన మందకృష్ణను విమర్శించిన జగన్ పార్టీ నాయకులపై విరుచుకుపడ్డారు. మాదిగ జాతిని మందకృష్ణ చంద్రబాబుకు తాకట్టు పెడ్డాడని వాఖ్యానించడాన్ని నాగరాజు తప్పుబట్టారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని నాగరాజు తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి కొంత మంది మాదిగలను రెచ్చగొట్టి ఈ విధమైన మాటలు మాట్లాడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దళితులను నమ్మించి మోసం చేసింది జగనే అని ఆయన నిలదీశాడు. 

మాదిగల జీవితాలలో వెలుగు నింపింది చంద్రబాబు నాయుడని తెలిపారు. జగన్ ఐదు సంవత్సరాలు పాలనలో మాదిగలను నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో దళితులకు 27 పథకాలు అమలు చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో ఒక్క సరైన పథకం కూడా అమలుచేయలేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి మాదిగలు సరైన గుణపాఠం చెబుతారని తెలిపారు. చంద్రబాబు గెలుపు మాదిగల గెలుపులా చూడాలన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే మాదిగ జాతి అభివృద్ధి చెందుతుందని నాగారాజు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details