LIVE : ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మీడియా సమావేశం - Thummala Nageswara Rao Live
Published : Aug 21, 2024, 5:03 PM IST
|Updated : Aug 21, 2024, 5:34 PM IST
Minister Tummala Live (ETV Bharat)
Minister Tummala Live : తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. తమ రాజకీయ మనుగడ కాపాడుకొనేందుకు పడుతున్న పాట్లు చూస్తే జాలేస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ప్రతిపక్ష నేతలు అనేక విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియా సాక్షిగా రైతాంగాన్ని అసత్య ప్రచారాలతో ఆందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.బ్యాంకుల నుంచి వివరాలు అందిన ప్రతి ఖాతాదారునికి వారి అర్హతను బట్టి మాఫీ చేసే బాధ్యత తమ ప్రభుతానిదని తుమ్మల స్పష్టం చేశారు. ఇప్పటికి కేవలం రూ.2 లక్షల వరకు కుటుంబ నిర్ధారణ జరిగిన ఖాతాదారులందరికీ పథకాన్ని వర్తింప చేశామని తుమ్మల వెల్లడించారు. బ్యాంకర్ల నుంచి వచ్చిన డేటాలో తప్పుగా వివరాలు ఉన్న రైతుల వివరాలను కూడా వారి వద్ద నుంచి సేకరిస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి లబ్దిదారుడికి న్యాయం చేయాలనేదే తమ ఉద్దేశమన్నారు. ఈ సందర్భంగా మీడియాతో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతున్నారు.
Last Updated : Aug 21, 2024, 5:34 PM IST