ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ నుంచే మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం: మంత్రి మండిపల్లి - Ramprasad Reddy on Free Bus Scheme

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 30, 2024, 5:24 PM IST

Updated : Jun 30, 2024, 6:54 PM IST

రాష్ట్రంలోని మహిళలకు త్వరలో తీపి కబురు విపిస్తాం (ETV Bharat)

Minister Ramprasad on Free Bus Scheme : మేనిఫెస్టోలో తమ ప్రభుత్వం ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీపై పరిశీలిస్తున్నామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్​రెడ్డి తెలిపారు.  విశాఖ నుంచే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. త్వరలోనే నారీమణులకు తీపి కబురు చెబుతామని పేర్కొన్నారు. ఈ పథకం అమల్లో ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేస్తామని ఆయన చెప్పారు. 

అదేవిధంగా ఉచిత బస్సు కల్పనలో ఎదురయ్యే సమస్యలపై చర్చిస్తున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్​రెడ్డి పేర్కొన్నారు. పథకం అమలవుతున్న రాష్ట్రాల్లో పర్యటిస్తామని చెప్పారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు గత వైఎస్సార్సీపీ సర్కార్ ఆర్టీసీని పూర్తిగా విలీనం చేయలేదని విమర్శించారు. జీతాలు ఇచ్చేది ప్రభుత్వమని, కానీ కార్పొరేషన్ పేరు చెప్పి వారు దోచుకున్నారని ఆరోపించారు. అందుకే సిబ్బంది, ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా రోడ్డు రవాణా సంస్థను ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా ఏపీఎస్​ఆర్టీసీలో ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రవేశపెడతామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్​రెడ్డి చెప్పారు.

Last Updated : Jun 30, 2024, 6:54 PM IST

ABOUT THE AUTHOR

...view details