ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 2, 2024, 4:55 PM IST

ETV Bharat / videos

బెజవాడలో తగ్గని డయేరియా విజృంభణ - Diarrhea Death Cases in Vijayawada

Diarrhea Death Cases in Vijayawada: విజయవాడలో రెండు వారాలు గడుస్తున్నా డయేరియా కేసుల సంఖ్య తగ్గడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో డయేరియా లక్షణాలతో ఇప్పటికి తొమ్మిదిమంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. వాంతులు, విరోచనాలతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని తల్లిదండ్రులు వాపోయారు. డయేరియాను అరికట్టడంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విఫలమయ్యారని బాధితులు ఆరోపించారు. సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీటి సమస్యను అరికట్టి ప్రజలకు సురక్షిత నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

"రెండు వారాలు గడుస్తున్నా డయేరియా కేసులు సంఖ్య తగ్గడం లేదు. వాంతులు, విరేచనాలతో బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదు. డయేరియాను అరికట్టడంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విఫలమయ్యారు. కలుషిత నీటి సమస్యను అరికట్టేందుకు ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం." - స్థానికులు 

ABOUT THE AUTHOR

...view details