ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భోగాపురం విమానాశ్రయ పనులు నిర్ణీత సమయానికి పూర్తి చేయాలి: సీఎస్ జవహర్​రెడ్డి - Bhogapuram Airport Works

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 20, 2024, 7:39 PM IST

CS Jawahar Reddy (ETV Bharat)

CS Jawahar Reddy on Bhogapuram Airport Works : భోగాపురం విమానాశ్ర‌య నిర్మాణ ప‌నులను వేగ‌వంతం చేసి, నిర్ణీత స‌మ‌యానికి పూర్తి చేయాల‌ని, రాష్ట‌ ప్ర‌భుత్వ‌ చీఫ్​ సెక్ర‌ట‌రీ కెఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భోగాపురం అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డు విమానాశ్ర‌య నిర్మాణ ప‌నుల‌ను ఆయ‌న నేడు ప‌రిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఎయిర్‌పోర్టు టెర్మిన‌ల్ భ‌వ‌నం, ర‌న్‌వే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంట‌ర్ భ‌వ‌నాలు, ఇత‌ర నిర్మాణ ప‌నుల‌ పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.  అనంతరం ఎయిర్‌పోర్టు ప్లాన్​ను ప‌రిశీలించారు. నిర్మాణ ప‌నుల‌కు సంబంధించిన అంశాల‌ను జీఎంఆర్ ప్ర‌తినిధులు వివ‌రించారు. 

వీలైనంత త్వరగా, ఎయిర్​పోర్టు పనులను పూర్తి చేస్తామని జీఎంఆర్ ప్రతినిధులు సీఎస్ కు వివరించారు. వారితో చర్చించిన సీఎస్, ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన ప‌నుల‌ ప‌ట్ల  సంతృప్తిని వ్య‌క్తం చేశారు. సీఎస్ జ‌వ‌హ‌ర్​ రెడ్డి ప‌ర్య‌ట‌న‌లో జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ కె. కార్తీక్‌, ఆర్‌డిఓ ఎంవి సూర్య‌క‌ళ‌, తహసీల్దార్ శ్యామ్ ప్ర‌సాద్‌, జిఎంఆర్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ సిఇఓ మ‌నోమ‌య్ రాయ్‌, ప్రాజెక్టు హెడ్ బిహెచ్.ఎ. రామ‌రాజు, ఇత‌ర ప్ర‌తినిధులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఇక సీఎస్ పర్యటన సమాచారం మీడియాకు చెప్పకుండా అధికారులు గోప్యంగా ఉంచారు. జిల్లా సమాచార శాఖ నుంచి సీఎస్ వీడియోలు వచ్చినట్లు తెలుస్తోంది. 

ABOUT THE AUTHOR

...view details