ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

బూతుల యూనివర్సిటీ కుప్ప కూలిపోయే రోజులు దగ్గర పడ్డాయి: పృథ్వీరాజ్ - Actor Prithviraj 30 years

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2024, 5:16 PM IST

Comedian Prithviraj Sensational Comments on YSRCP: టీడీపీ - జనసేన కలయిక ద్వారా స్థిరత్వం, అభివృద్ది, ప్రజా సంక్షేమం నెలకొంటుందని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పృథ్వీరాజ్ వైఎస్సార్సీపీపై నిప్పుపలు చెరిగారు.  రాబోయే ఎన్నికల్లో 136 స్థానాలతో టీడీపీ - జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన వెల్లడించారు. 21 ఎంపీ స్థానాలు వస్తాయని పృథ్వీరాజ్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాము  175 సీట్లు గెలుస్తామని చెప్పిన వైఎస్సార్సీపీ నేతలు ఇప్పుడు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల సీట్లు మార్చినంత మాత్రనా ప్రజలు ఓట్లు వేయరని ఎద్దేవా చేశారు. 

బూతుల మంత్రులు, బూతుల యూనివర్సిటీ కుప్ప కూలిపోయే రోజులు దగ్గర పడ్డాయని పృథ్వీరాజ్ ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల తీర్పు అద్భుతంగా ఉంటుందన్నారు. నారా లోకేశ్ వద్ద వైఎస్సార్సీపీ నేతల అక్రమాలకు సంబంధించిన రెడ్ డైరీ ఉందని, తన వద్ద పీఆర్ డైరీ (పృథ్వీరాజ్ డైరీ) ఉందని తెలిపారు. త్వరలో ఆ డైరీ బయటకు తీస్తానని వెల్లడించారు. వైఎస్ షర్మిల జగనన్న వదిలిన బాణం కాదని, ఇప్పుడు కాంగ్రెస్ వదిలిన బాణం అంటూ ఎద్దేవా చేశారు. మంత్రులు బూతులు తిట్టడం తప్పా, గత నాలుగున్నర సంవత్సరాలుగా ప్రాజెక్టులు, అభివృద్దిపై తదితర అంశాలపై ఒక్కసారైనా మాట్లాడారా అంటూ పృథ్వీరాజ్ ప్రశ్నించారు.  

ABOUT THE AUTHOR

...view details