ఆంధ్రప్రదేశ్

andhra pradesh

LIVE: పింఛన్ల పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం - CBN Started Pensions Distribution

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 1, 2024, 6:19 AM IST

Updated : Jul 1, 2024, 8:33 AM IST

CM_Chandrababu_Started_Distribution_of_Pensions_Live (ETV Bharat)
CM Chandrababu Started Distribution of Pensions Live: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పింఛన్ల పండగ మొదలైంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందిస్తోంది. తద్వారా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర విభాగాలకు చెందిన వారి మోముల్లో చిరునవ్వులు పూయిస్తోంది. నూతన ప్రభుత్వం చేపట్టే తొలి అతిపెద్ద కార్యక్రమం ఇది. రూ.7,000 చొప్పున పింఛను అందజేయడమనేది దేశ చరిత్రలోనే ఒక రికార్డు. గుంటూరు జిల్లా పెనుమాకలో నిర్వహించనున్న పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు  పాల్గొన్నారు. అక్కడ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి స్వయంగా ఆయనే పింఛన్లను అందించారు. ప్రజల వద్దకే పాలన దిశగా తొలి అడుగు వేశారు. మిగతాచోట్ల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛను ఇస్తున్నారు. అవసరమైన చోట్ల ఇతర శాఖల ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. నగదుతోపాటు చంద్రబాబు రాసిన లేఖను లబ్ధిదారులకు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్ల పంపిణీని ప్రారంభించారు.  ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Jul 1, 2024, 8:33 AM IST

ABOUT THE AUTHOR

...view details