ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎమ్మెల్యేలు లేకుండానే కార్యక్రమాలు - వైఎస్సార్సీపీ కొత్త ఇంఛార్జ్​లే సర్వం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 7:52 PM IST

Class_War_in_YSRCP_in_Kodumuru_Constituency

Class War in YSRCP in Kodumuru Constituency: వైఎస్సార్సీపీలో నియోజకవర్గ నూతన ఇంఛార్జ్​లను నియమించిన తర్వాత స్థానిక ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోయింది. కర్నూలు జిల్లా కోడుమూరు (ఎస్సీ) నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్.సుధాకర్ ఉండగా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున డాక్టర్. ఆదిమూలపు సతీష్​ను ఇంఛార్జ్​గా అధిష్ఠానం ఎంపిక చేసింది. దీంతో ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో ప్రాధాన్యత లేకుండా పోయింది. ఎమ్మెల్యేను ఆహ్వానించకుండానే అధికార కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యకలాపాలకు నూతనంగా నియమించిన ఇంఛార్జ్​ ఆదిమూలపు సతీష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 

కర్నూలులోని వెంకయ పల్లె ఎల్లమ్మ దేవాలయం (దేవాదాయశాఖ) నూతన ఛైర్మన్​గా ఎ.మహేశ్వర్ రెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా వెంకాపల్లె ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన కమిటీ సభ్యులతో దేవాదాయశాఖ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్.సుధాకర్ లేకుండానే నిర్వహించారు. 

కోడుమూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్​ ఆదిమూలపు సతీష్​తో పాటు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ముఖ్య నేత కోట్ల హర్షవర్థన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో నిజమైన వైఎస్సార్సీపీ కార్యకర్తలకు న్యాయం జరగలేదని పరోక్షంగా ఎమ్మెల్యేను విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details