ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నీటి సమస్యను పరిష్కరించాలని రోడ్డెక్కిన మహిళలు - పట్టించుకోని అధికారులు - People Protest in Water Problem

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 5:33 PM IST

Chinapandraka People Protest Suffering From Water Problem: తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న సంఘటనలు తరచూ చూస్తున్నాం. అటువంటి సమస్యనే కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్న పాండ్రాక ప్రజలు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్థులు, మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. గ్రామానికి తాగునీరు సక్రమంగా సరఫరా చేయడం లేదని పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నీటి సమస్యతో సతమతమవుతున్నామని అధికార పార్టీ నేతలకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అసలే వేసవికాలం మంచినీళ్లు లేకుండా ఎలా ఉండాలని ప్రజలు అధికారులను ప్రశ్నించారు. మల్లేశ్వరం నుంచి పాండ్రాక వెళ్లే తాగునీరు ప్రధాన పైపులైన్ నుంచి తమ గ్రామానికి మాత్రమే నీళ్లు రాకుండా చేస్తున్నారంటూ ఆర్​డబ్ల్యూఎస్ (Rural Water Supply and Sanitation Department) అధికారులతో మహిళలు వాగ్వాదానికి దిగారు.

నీళ్లు లేక మేము ఇబ్బందులు పడుతుంటే ప్రక్క గ్రామాలకు ఎలా కేటాయిస్తారు. గ్రామంలో ఉన్న నీటి సమస్యను అధికారులు తీర్చాలి. మహిళలు రోడ్డు ఎక్కుతేనే అధికారులు నీళ్లు ఇస్తారా? మాకు రావాల్సిన నీటిని ఇతర గ్రామాలకు తరలించడమేంటి? - చిన్న పాండ్రాక గ్రామస్థులు 

ABOUT THE AUTHOR

...view details