ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Live: శ్రీకాకుళం జిల్లా అముదాలవలసలో చంద్రబాబు ప్రజాగళం - ప్రత్యక్షప్రసారం - Chandrababu Prajagalam - CHANDRABABU PRAJAGALAM

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 23, 2024, 6:46 PM IST

Updated : Apr 23, 2024, 7:57 PM IST

Chandrababu Prajagalam Sabha Live: శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాగళం బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా అముదాలవలసలో చంద్రబాబు ప్రజాగళం సభలో పాల్గొన్నారు. అంతకుముందు విజయనగరం జిల్లాలోని గజపతినగరంలో ఆడబిడ్డలతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల్లో చాలా చైతన్యం ఉందన్న చంద్రబాబు, మొదటిసారి ఆడపిల్లలను చదివించాలని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని కొనియాడారు. ప్రజల గుండెల్లో స్థానమే తన ఆశయమన్న చంద్రబాబు, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పేదల కోసం పని చేశానని అన్నారు. ఆడపిల్లలను చదివిస్తే ఆర్థికాభివృద్ధి సాధిస్తారని, తెలుగుజాతి నెంబర్‌వన్‌గా నిలపాలన్నది తన లక్ష్యం అని పేర్కొన్నారు. మహిళలకు విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. జగన్ పాలనలో కుంభకోణాలు తప్ప ఏమీ లేదని మండిపడ్డారు. కుంభకోణాలు జరిగితే ప్రజలంతా బానిసలుగా ఉండాల్సి వస్తుందన్న చంద్రబాబు, టీడీపీ అధకారంలోకి వచ్చాక పేదరిక నిర్మూలనకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. కాగా ప్రస్తుతం అమదాలవలసలో చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ ప్రత్యక్షప్రసారం.
Last Updated : Apr 23, 2024, 7:57 PM IST

ABOUT THE AUTHOR

...view details