ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 12:20 PM IST

Updated : Apr 20, 2024, 1:50 PM IST

ETV Bharat / videos

LIVE గూడూరు నియోజకవర్గంలో మహిళ సాధికారతపై చంద్రబాబు ముఖాముఖి - ప్రత్యక్ష ప్రసారం - Chandrababu Live

Chandrababu Naidu Live : మహిళ సాధికారత కోసం గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఉన్నతి పథకాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తిగా పాతరేసింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నుంచి మహిళ అభ్యున్నతిని తుంగలో తొక్కారు. నేడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నానా హైరానా చేస్తున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గూడూరు నియోజకవర్గంలో మహిళ సాధికారతపై చంద్రబాబు ముఖాముఖి ఏర్పాటులో అక్కాచెల్లెమ్మల సమస్యలు వింటూ వారికి భరోసా కల్పిస్తున్నారు. అధికారంలోని రాగానే ఆడ బిడ్డలకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని హామీ ఇస్తున్నారు.  టీడీపీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత, స్త్రీ సంక్షేమం గురించి కృషి చేస్తోందని చంద్రబాబు గుర్తు చేశారు. ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పిస్తూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మహిళా సమానత్వానికి నాంది పలికిన విషయం తెలిసిందే.గూడూరు నియోజకవర్గంలో మహిళ సాధికారతపై చంద్రబాబు ముఖాముఖి - ప్రత్యక్ష ప్రసారం మీ కోసం
Last Updated : Apr 20, 2024, 1:50 PM IST

ABOUT THE AUTHOR

...view details