తెలంగాణ

telangana

LIVE : మెదక్‌ బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో హరీశ్‌రావు మీడియా సమావేశం - Harish Rao Press Meet Live

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2024, 1:32 PM IST

Updated : Sep 17, 2024, 1:50 PM IST

BRS Leader Harish Rao Press Meet At Medak (ETV Bharat)
BRS Leader Harish Rao Press Meet At Medak : సెప్టెంబరు 17న బీఆర్ఎస్ నేతలు జాతీయ సమైక్యత దినోత్సవాన్ని జరిపారు. గతంలో ఈ దినోత్సవాన్ని మాజీ సీఎం కేసీఆర్ నిర్వహించిన సంగతి అందరికి విదితమే. మెదక్‌ జిల్లా  జెండాను ఎగురవేశారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. గత పదేళ్లు బీఆరఎస్ పార్టీ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. విద్య, వైద్యం వాటికి ఎలాంటి వాటికి ఆటంకం కలగకుండా అభివృద్ధి మార్గంలో నడిపించిందన్నారు. ఆరు గ్యాంరటీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వాటిని మరచిందన్నారు. సచివాలయంలో రాజీవ్‌ గాంధీ ప్రతిష్టాపన గురించి మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహ స్థానంలో రాజీవ్ గాంధీ పెట్టడం ఎంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేరాలు పెచ్చరిల్లుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు మేలు చేసే ప్రభుత్వం అంటూ ఎందుకు రైతు భీమా ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫించన్ ఇవ్వడం లేదని ఆరోపించారు. వరదల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం వీలైనంత తర్వగా చెల్లించాలని డిమాండ్ చేశారు. 
Last Updated : Sep 17, 2024, 1:50 PM IST

ABOUT THE AUTHOR

...view details