ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'బీజేపీలో చేరికకు వైఎస్సార్​సీపీ నేతలు సిద్ధం- ఆ పార్టీ ఖాళీ అవడం ఖాయం' - MLA Adinarayana on YSRCP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 21, 2024, 6:56 PM IST

'బీజేపీలో చేరికకు వైఎస్సార్​సీపీ నేతలు సిద్ధం- ఆ పార్టీ ఖాళీ అవడం ఖాయం' (ETV Bharat)

BJP MLA Adinarayana Sensational Comments in Assembly: అసెంబ్లీ లాబీల్లో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరేందుకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీ అగ్ర నాయకత్వంతో టచ్‌లోకి వెళ్లారని వారితో మాట్లాడుతున్నారని తెలిపారు. వైసీపీ ఖాళీ కావడం ఖాయంగా కన్పిస్తోందని పేర్కొన్నారు. బీజేపీ ఒప్పుకుంటే అవినాష్ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కానీ బీజేపీ నాయకత్వం వాళ్లు అక్కర్లేదని అంటోందని తెలిపారు. కానీ తాము చేరతామంటూ మిథున్‌ ఇంకా లాబీయింగ్ చేస్తున్నారన్నారు.

బీజేపీలో చేరాల్సిందిగా తండ్రి పెద్దిరెడ్డి మీద కూడా మిథున్‌ ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఓదార్పు యాత్ర కోసం జగన్ మళ్లీ 14 కారణాలు వెతుక్కుంటున్నారని విమర్శించారు. ఏ దారి దొరక్కపోతే బాధితులను సృష్టించుకుంటారన్నారు. చెల్లివల్లే నష్టపోయామని జగన్ తెలుసుకున్నాడని, ఆమెతో రాజీ చేయాలని తల్లిని కోరాడన్నారు. అన్ననే వచ్చి కాంగ్రెస్​లో చేరాలని షర్మిల చెప్పేసిందని అన్నారు. త్వరలోనే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్టు అవుతారన్నారు.

ABOUT THE AUTHOR

...view details