ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఫ్లాట్ ఫామ్​పైకి దూసుకు వచ్చిన ఆర్టీసీ బస్సు - తప్పిన పెను ప్రమాదం - RTC bus rams into platform

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 7, 2024, 1:42 PM IST

APSRTC bus overshot the platform

APSRTC Bus Overshot the Platform: అనంతపురం జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్​లో పెను ప్రమాదం తప్పింది. ఈ రోజు ఉదయం బస్సు డిపో నుంచి  హిందూపురం ఆర్టీసీ బస్సు బయటకు వచ్చింది. బస్సు డ్రైవర్ ఆ బస్సును ఫ్లాట్ ఫామ్​పైకి తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. అయితే, బస్సు మాత్రం ఒక్కసారిగా ఫ్లాట్ ఫామ్ మీదకు వేగంగా దూసుకొచ్చింది. ఆర్టీసీ బస్సు ఫ్లాట్ ఫామ్ మీదకు వచ్చిన సమయంలో, అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. డ్రైవర్ నిర్లక్ష్యం (RTC Driver negligence) వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్  బ్రేక్ వేయబోయి ఎక్స్ లెటర్​ను నొక్కడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదంపై  (Bus accident) ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపడతామని తెలిపారు. బస్సులో తలెత్తిన సాంకేతిక లోపమా, లేదా డ్రైవర్ నిర్లక్ష్యమా అనేది విచారణలో తేలుతుందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details