ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

ETV Bharat / videos

ఏపీఎస్ఆర్టీసీ మరో ప్రతిష్టాత్మక ఘనత - నగదు రహిత లావాదేవీల్లో జాతీయస్థాయి అవార్డు - APSRTC Got National Level Award

APSRTC Got National Level Award : ఎపీఎస్ ఆర్టీసీ మరో అరుదైన స్థానాన్ని దక్కించుకుంది. జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక అవార్డును సాధించి ఔరా అనిపించుకుంది. గవర్నెన్స్ నౌ 9వ పి.ఎస్.యూ ఐటీ అవార్డు -2024ను తన ఖాతాలో వేసుకుంది.

అవార్డును సాధించేందుకు దోహదపడిన అంశాలు: యాప్ ద్వారా నగదు రహిత లావాదేవీ (Cashless transactions) లు, కాగిత రహిత టికెట్ల జారీ చేయడంతో సహా బస్సుల్లో డిజిటల్ టికెట్​ల జారీ, అన్ని బస్సుల్లో ట్రాకింగ్ ఏర్పాటు చేసినందుకు ఈ అవార్డుకు ఎంపికైంది. దిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఐటీ చీఫ్ ఇంజినీర్ వి.సుధాకర్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సేవలను మరింత విస్తృతం చేసే విధంగా అడుగులు వేస్తామని తెలియజేశారు. ప్రతి ఒక్కరికీ సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. అన్ని రకాల వయసుల వారినీ దృష్టిలో ఉంచుకుని సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details