ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైన్‌కు కేంద్రం రూ.125 కోట్లు కేటాయింపు - Kotipalli Narsapur Railway Project

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 31, 2024, 10:37 PM IST

Kotipalli To Narsapur Railway Line (ETV Bharat)

Allocated 125 Crores in Kotipalli To Narsapur Railway Line : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కోటిపల్లి- నర్సాపురం కొత్త రైల్వే లైన్‌కు ఇంకా 253 హెక్టార్లకు పైగా భూమి కావాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంకా భూసేకరణ చేయాలని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం 163 హెక్టార్లు మాత్రమే అప్పగించిందని తెలుగుదేశం ఎంపీ హరీష్‌ బాలయోగి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. కోటిపల్లి - నర్సాపురం రైల్వేలైన్‌ పనులను 2 వేల 120 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టినట్లు కేంద్రం పేర్కొంది.

ఇప్పటివరకు ఈ రైల్వే లైన్​కు 11 వందల 81 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రం వివరించింది. 2024- 25 బడ్జెట్‌లో కూడా 125 కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్రం ప్రభుత్వం తెలిపింది. రైల్వే లైన్‌ నిర్మాణంలో 25 శాతం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా భరించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రైల్వే లైన్‌ నిర్మాణం 216 నెలలు ఆలస్యంగా నడుస్తున్నట్లు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

ABOUT THE AUTHOR

...view details