ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రానైట్‌ పరిశ్రమలపై కక్షగట్టిన వైసీపీ ప్రభుత్వం- రాయితీల్ని గాలికొదిలేసిన జగన్​ సర్కార్​ - YCP Govt Avoided concessions

YCP Govt Has Avoided concessions of Granite Industries: వైసీపీ ప్రభుత్వం తీరు చూస్తుంటే రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలపై కక్షగట్టిందనిపిస్తుంది. కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా, ఉన్నవాటిని సైతం వెల్లగొట్టే విధంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ చర్యల వల్ల కోట్లలో నష్టపోతున్నామని పరిశ్రమలు మూసేయడం తప్ప వేరేదారి లేదని యజమానులు వాపోతున్నారు.

YCP Govt Has Avoided concessions of Granite Industries
YCP Govt Has Avoided concessions of Granite Industries

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 11, 2024, 9:01 AM IST

గ్రానైట్‌ పరిశ్రమలపై కక్షగట్టిన వైసీపీ ప్రభుత్వం- రాయితీల్ని గాలికొదిలేసిన జగన్​ సర్కార్​

YCP Govt Has Avoided concessions of Granite Industries: జగన్‌ సర్కార్‌ తీరు చూస్తుంటే పరిశ్రమలపై కక్షగట్టిందేమో అనిపిస్తుంది. ఐదు సంవత్సరాల పాలనలో కొత్త పరిశ్రమలు తీసుకురాలేదు సరికదా, ఉన్న వాటిని తరిమేశారు. ఎంతో మందికి ఉపాధి కల్పించే గ్రానైట్‌ పరిశ్రమలకు తాళం వేయించేస్తున్నారు. గత ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీల్ని ఎగ్గొట్టిన ప్రభుత్వం యాజమాన్యాలపై విద్యుత్‌ ఛార్జీలు, రకరకాల రుసుములతో బాదుడు బండ మోపి ముక్కు పిండి మరీ వసూలు చేస్తోంది. రీసర్వే కోసం తయారు చేసిన రాళ్లను ప్రభుత్వం తీసుకోకపోవడంతో యజామాన్యాలు రోడ్డున పడే దుస్థితి నెలకొంది. ఫలితంగా మేం పరిశ్రమలు నడపలేం మహాప్రభో అంటూ యాజమాన్యాలు ముూసివేత బాటపట్టాయి.

వేల మందికి ప్రత్యక్షంగా, లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే గ్రానైట్‌ పరిశ్రమను వైసీపీ సర్కారు ముంచేసింది. జగన్‌ అధికారం చేపట్టగానే గ్రానైట్‌ లీజుల్లో తనిఖీల పేరిట వేధింపులు మొదలుపెట్టారు. భారీ జరిమానాలతో బెదిరించి లీజుదారులను దారికి తెచ్చుకున్నారు. కొందరు తమ లీజులను అధికార పార్టీ వాళ్లకు అమ్ముకోవాల్సి వచ్చింది. మరికొందరు వైసీపీ నేతలకు భాగస్వామ్యం కల్పించారు. ఇలా దారికొచ్చిన వారికే జరిమానాల నుంచి అధికారులు ఉపశమనం కలిగించారు. గ్రానైట్‌ కటింగ్, పాలిషింగ్‌ యూనిట్ల విషయంలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. పరిశ్రమల మనుగడకు సహకారం అందించకుండా విద్యుత్‌ ఛార్జీలు, ఇతర రుసుములు పేరిట బాదేస్తున్నారు. రాయితీలను ఆపేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా 4వేల గ్రానైట్‌ పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొంది.

వైసీపీ హయాంలో చిక్కుల్లో సూక్ష్మసేద్యం - రెండు నుంచి ఐదో స్థానానికి దిగజార్చిన వైనం

ప్రకాశం, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి తదితర జిల్లాల్లో దశాబ్దాల తరబడి గ్రానైట్‌ పరిశ్రమలు ఉన్నాయి. వేల మందికి ఉపాధి కల్పించే ఈ పరిశ్రమలకు గత ప్రభుత్వాలు మద్దతుగా నిలిచాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. గ్రానైట్‌ కటింగ్, పాలిషింగ్‌ యంత్రాలకు విద్యుత్‌ వినియోగం ఎక్కువ. ఇప్పుడీ విద్యుత్‌ ఛార్జీలే తలకు మించిన భారమయ్యాయి. గతంలో యూనిట్‌ ధర 6 రూపాయల 50 పైసలు ఉండగా ఇప్పుడది ట్రూఅప్‌ ఛార్జీలు, ఇతరత్రాలతో కలిపి ప్రస్తుతం 9 రూపాయలకు చేరింది. విద్యుత్‌ ఛార్జీలను యూనిట్‌కు రూ.6.50 పైసల నుంచి రూ.3.50 పైసలు చేస్తానని జగన్‌ పాదయాత్రలో హామీ ఇచ్చారు. సీఎం అయ్యాక దాని గురించి పట్టించుకోలేదు. రెండేళ్ల కిందట హడావిడిగా యూనిట్‌కు 2 రూపాయలు తగ్గిస్తున్నట్లు ఉత్తర్వులిచ్చినా దానిని అమలు చేయలేదు. కొవిడ్‌ సమయంలో గ్రానైట్‌ పరిశ్రమలకు మూడు నెలల విద్యుత్‌ ఛార్జీలను ప్రభుత్వం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. ఈ మొత్తం 187 కోట్లు కాగా ఇప్పటికీ వాటిని చెల్లించలేదు. పరిశ్రమల ప్రోత్సాహకాల కింద ఇచ్చే సొమ్మును మూడేళ్లుగా విడుదల చేయడం లేదు. విద్యుత్‌ బిల్లులో 25 శాతం, బ్యాంకు రుణవడ్డీలో పావలా రాయితీగా ఇవ్వాలి. కొత్తగా ఏర్పాటు చేసిన పరిశ్రమలకు పెట్టుబడి రాయితీనీ చెల్లించాలి. వీటిని కూడా వైసీపీ ప్రభుత్వం విడుదల చేయడం లేదు.

అభివృద్ధి కోసం అయితే అప్పు వద్దు - జగన్‌ సర్కార్ తీరుపై అధికారుల విస్మయం

ప్రభుత్వం చేపట్టిన రీసర్వే కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రానైట్‌ పరిశ్రమా సర్వే రాళ్లు ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఒక్కో పరిశ్రమకు లక్ష్యాన్ని నిర్దేశించి రాళ్లు తయారు చేయించారు. యజమానులు ఇప్పటికే రీసర్వేలో మూడు విడతలకు 76 లక్షల సర్వే రాళ్లను ఏపీఎండీసీ(Andhra Pradesh Mineral Development Corporation Limited) ద్వారా సరఫరా చేశారు. మూడో విడత రీసర్వే ఇంకా పూర్తి కాలేదు. దీంతో నాలుగో విడతకు సిద్ధం చేసిన రాళ్లను తీసుకోకుండా ప్రస్తుతం నిలిపేశారు.

సీఎం జగన్ అయిదేళ్ల పాలన ఎలా ఉంది? - చెప్పింది చేశారా?

గ్రానైట్‌ పరిశ్రమలకు వైసీపీ ప్రభుత్వం శ్లాబ్‌ విధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఒక్కో పరిశ్రమలో ఎన్ని కటింగ్‌ బ్లేడ్స్‌ ఉంటాయో వాటికి ప్రతి నెలా నిర్దేశిత మొత్తం చెల్లించాలి. ప్రకాశం జిల్లా పరిధిలోని పరిశ్రమల్లో బ్లేడ్‌కు రూ.27 వేలు, ఇతర జిల్లాల్లో బ్లేడ్‌కు రూ.22 వేలుగా ధర ఖరారు చేశారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో లభించే గెలాక్సీ వంటి అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ ఉండే రకానికి, మార్టూరు, బల్లి కురవ, సంతమాగులూరు తదితర ప్రాంతాల్లో లభించే స్టీల్‌ గ్రే, బ్లాక్‌ పెరల్‌ వంటి కలర్‌ గ్రానైట్‌ రకానికి ఒకే శ్లాబ్‌ ధర ఉంది. దీంతో 22 వేల రూపాయలు శ్లాబ్‌కు తగ్గించాలని యజమానులు రెండేళ్లుగా కోరుతున్నారు. ఆ మేరకు తగ్గిస్తామని చెప్పిన గనుల శాఖ మంత్రి పట్టించుకోలేదు. ప్రభుత్వ చర్యల వల్ల కోట్లలో నష్టపోతున్నామని, ఇక పరిశ్రమలు పూర్తిగా మూసేయడమే తమముందు ఉన్న మార్గమని యజమానులు వాపోతున్నారు.

పేదల ఇళ్లపై పగబట్టిన జగన్‌ సర్కార్ - అయిదేళ్లుగా పూర్తి చేయని వైనం

ABOUT THE AUTHOR

...view details