తెలంగాణ

telangana

ETV Bharat / state

ముందుగా అందుకున్న పింఛన్​ సొమ్మే - ఆ వృద్ధురాలి అంత్యక్రియలకు సాయమైంది - FUNERAL WITH PENSION MONEY

పింఛన్ సొమ్ము అందుకున్న కొద్దిసేపటికే వృద్దురాలి మృతి - అదే డబ్బుతో వృద్ధురాలి అంత్యక్రియల నిర్వహణ

Elderly woman Dies After Receiving Pension
Elderly woman Dies After Receiving Pension (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 1, 2024, 3:18 PM IST

Elderly woman Dies After Receiving Pension :పింఛన్ సొమ్ము అందుకున్న వృద్ధురాలు కొద్ది నిమిషాలకే తుది శ్వాస విడిచిన ఘటన ఆంధ్రప్రదేశ్​లోని కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామానికి చెందిన కురందాసు సత్యవతి (84) శనివారం ఉదయం పింఛన్ డబ్బులు తీసుకున్న 20 నిమిషాలకే మృతి చెందారు.

ఒకటో తేదీన ఇచ్చి ఉంటే పింఛన్ తీసుకునే అవకాశమే ఆమెకు ఉండేది కాదని బంధువులు పేర్కొన్నారు. సత్యవతి పొందిన పింఛను నగదుతో ఆమె అంత్యక్రియలను నిర్వహించారు. ఒకటో తేదీ ఆదివారం కావడంతో కూటమి సర్కారు ముందుగా అందించిన రూ.4000 పింఛనుతో ఆమెకు గౌరవంగా అంతిమ యాత్ర నిర్వహించామని గ్రామస్థులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details