తెలంగాణ

telangana

ETV Bharat / state

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్ - విమానంలో మీతోపాటే ఇరుముడి - ఎప్పటినుంచో తెలుసా?

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌ - ఇక నుంచి విమానంలో వెళ్లేటప్పుడు ఇరుముడిని మీ వద్దే పెట్టుకోవచ్చు- స్పష్టం చేసిన కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు

Union Minister Rammohan Naidu On Irumudi
Union Minister Rammohan Naidu On Irumudi (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Updated : 3 hours ago

Union Minister Rammohan Naidu On Irumudi :అయ్యప్ప భక్తులకు కేంద్రమంత్రి కె. రామ్మోహన్​ నాయుడు గుడ్​ న్యూస్​ చెప్పారు. అయ్యప్ప దీక్ష సమయంలో స్వామివారి దర్శనానికి విమానంలో ప్రయాణించే భక్తులు ఇక నుంచి ఇరుముడిని చెకిన్ బ్యాగేజీలో పెట్టాల్సిన అవసరం లేదని నేరుగా తమ వెంట తీసుకెళ్లవచ్చని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్​ నాయుడు తెలిపారు.

ఇప్పటివరకూ భద్రతా కారణాల దృష్ట్యా ఇరుముడిని వెంట తీసుకెళ్లనిచ్చేవారు కాదన్నారు. ఇప్పుడు భక్తులు ఇబ్బందులు తెలుసుకొని వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన శనివారం ఎక్స్​ వేదికగా పోస్టు చేశారు. ఆనంతరం శ్రీకాకుళంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్నే చెప్పారు.

"అయ్యప్ప స్మామి భక్తులు ఈ సమయంలో పెద్దఎత్తున మాలలు ధరించి, దీక్ష చేపట్టి, శబరిమల వరకు యాత్ర చేసి అయ్యప్ప స్మామిని దర్శించుకుంటారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ మాల ధరించి దర్శించుకోవడం చాలామంది చేస్తుంటారు. వారు ఉన్న మార్గాల్లో శబరిమల చేరుకుంటున్నారు. నా దృష్టికి ఓ చిన్న సమస్య వచ్చింది. అయితే ఏంటి సెక్యూరిటీ ప్రొటోకాల్ ప్రకారం చెక్ఇన్‌ లోనే ఇరుముడిని ఇచ్చేయాలి. దీనిపై దృష్టి సారించి ఆ సమస్యను తొలగించాం. ఇప్పుడు విమానంలో ప్రయాణించే స్వాములు తమ వెంట ఇరుముడిని తీసుకెళ్లొచ్చు." - రామ్మోహన్‌ నాయుడు, కేంద్ర మంత్రి

'విమానంలో బాంబు ఉందని బెదిరిస్తే జైలు శిక్ష'- కొత్త రూల్స్ ప్రకటించిన రామ్మోహన్ నాయుడు

సామాన్యుడికి సైతం విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తాం : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు - rammohan naidu as aviation minister

Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details