ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శరవేగంగా బుడమేరు గండ్ల పనులు- కట్టపై రామానాయుడు, లైవ్​ ద్వారా లోకేశ్​ పర్యవేక్షణ - BUDAMERU LEAKAGE WORKS ON FAST

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 6, 2024, 3:55 PM IST

BUDAMERU LEAKAGE WORKS ON FAST : మంత్రులు లోకేశ్, నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే రెండు గండ్లు పూడ్చివేయగా, మూడో గండి పూడ్చివేత పనులు ప్రారంభమయ్యాయి. డ్రోన్ లైవ్ ద్వారా సూచనలు ఇస్తూ పనులను లోకేశ్ పర్యవేక్షిస్తున్నారు. పూడిక పనులను ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్వయంగా పర్యవేక్షించారు.

BUDAMERU LEAKAGE WORKS ON FAST
BUDAMERU LEAKAGE WORKS ON FAST (ETV Bharat)

BUDAMERU LEAKAGE WORKS ON FAST :మంత్రులు లోకేశ్, నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు వేగంగా సాగుతున్నాయి. ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు రేయింబవళ్లు అక్కడే ఉండి రెండు గండ్లు పూడ్చివేయించారు. మూడవ గండి పూడ్చివేత పనులు ప్రారంభమయ్యాయి. డ్రోన్ లైవ్ ద్వారా సూచనలు ఇస్తూ పనులను లోకేశ్ పర్యవేక్షిస్తున్నారు. గండ్ల పూడ్చివేత పురోగతిపై మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్​తో కలిసి కమాండ్ కంట్రోల్ నుంచి లోకేశ్ సమీక్షించారు.

విజయవాడ సింగ్ నగర్​కు వరద ముంపును నియంత్రించేలా మూడో గండి పూడిక పనులు సైతం శరవేగంగా జరుగుతుండగా పనులను ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్​లతో కలసి పర్యవేక్షించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి బుడమేరు గండ్ల పూడిక పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి పనులను ఎప్పటికప్పుడు లైవ్ లో పరిశీలిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

బుడమేరు రెండు గండ్లు పూడ్చివేత- పనులపై చంద్రబాబుకు నివేదిస్తున్న మంత్రి నిమ్మల - BUDAMERU LEAKAGE WORKS

వాన కురుస్తున్నా, వరద పోటెత్తుతున్నా, చీకట్లు కమ్ముకున్నా మంత్రి రామానాయుడు మాత్రం బుడమేరు కాల్వ గట్ల నుంచి కదలడం లేదు. బుడమేరు కట్టపైనే భోజనం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు విజయవాడలో అధికారులతో సమీక్షిస్తుంటే, మంత్రి క్షేత్ర స్థాయిలో తిరుగుతున్నారు. దగ్గరుండి చేయిస్తేనే ఏ పని అయినా త్వరగా అవుతుందన్నది ముఖ్యమంత్రి నమ్మకమని, అదే స్ఫూర్తిని పాటిస్తున్నానని చెప్పారు. అన్ని గండ్లు పూడ్చిన తర్వాతే నగరానికి వస్తానని మంత్రి రామానాయుడు చెప్పారు.

విజయవాడ జక్కంపూడి కాలనీలో ప్రభుత్వం సహాయకార్యక్రమాలను ఉధృతంగా చేపట్టింది. పాలు, నీరు ఆహారపదార్థాలు, ఎప్పటికప్పుడు ట్రాక్టర్ల ద్వారా అందిస్తున్నారు. కాలనీ చివరి ఇళ్లకు వరుకూ వెళ్లి ఆహార పదార్ధాలను అందిస్తున్నారు. మంత్రి లోకేశ్ స్ఫూర్తితో తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ తెలుగు యువత దాదాపు నాలుగు ట్రాక్టర్ల మంచినీటి క్యాన్లు, వాటర్ ప్యాకెట్లు, బిస్కెట్స్ బాధితులకు తీసుకెళ్లారు. మరోవైపు వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి.

సింగ్​నగర్​లో మళ్లీ వరద- సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న ప్రజలు - Floods Increasing to Singh Nagar

విజయవాడ జక్కంపూడిలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. వరద బాధితులకు వైద్యం అందిస్తున్న మెడికల్ క్యాంపులను మంత్రి పరిశీలించారు. ముంపు గ్రామాల్లో సహాయ కార్యక్రమాల్లో గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము పాల్గొని ఆహార ప్యాకెట్ల పంపిణీ చేశారు. స్వయంగా ట్రాక్టర్ తోలుతూ ముంపు గ్రామాలలో పర్యటిస్తూ ముంపు బాధిత ప్రజలతో మాట్లాడుతూ అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

చీకట్లను చీల్చుకుంటూ బయట పడుతున్న విజయవాడ - చురుగ్గా సాగుతున్న సహాయక చర్యలు - Relief Work in Flood Affected Areas

ABOUT THE AUTHOR

...view details