ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలలో చెత్త సమస్యకు చెక్ - వ్యర్థాల తొలగింపు పనులు వేగవంతం - GARBAGE ISSUE IN TIRUMALA

20 ఏళ్లుగా పేరుకుపోయిన వ్యర్థాల గుట్టలు - ఆగస్టుకల్లా తడిచెత్త నుంచి బయోగ్యాస్‌ తయారీ

Garbage Issue in Tirumala
Garbage Issue in Tirumala (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2025, 11:18 AM IST

Garbage Issue in Tirumala :శ్రీవారు కొలువైన తిరుమల కొండపై గత ఐదు సంవత్సరాలు వ్యర్థాల తొలగింపును నిర్లక్ష్యం చేశారు. దీంతో అవి గుట్టల్లా పేరుకుపోయి కాలుష్యం వెదజల్లాయి. మరోవైపు డంపింగ్‌ యార్డ్‌ సమీపంలోని బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్న స్థానికులూ ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ క్రమంలోనే టీటీడీ నూతన పాలకవర్గం వ్యర్థాల తొలగింపు పనులను వేగవంతం చేసింది. తిరుమలను ప్రతిరోజూ 70,000ల నుంచి లక్ష మంది భక్తులు సందర్శిస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ 80 టన్నుల వరకు తడి, పొడి చెత్త వస్తోంది. ఇందులో తడిచెత్త అత్యధికంగా 57 టన్నులు, పొడిచెత్త 20 టన్నుల నుంచి 22 టన్నుల వరకు ఉంటోంది. వాటిని ఏ రోజుకారోజు తొలగించడం కీలకం.

2.5 లక్షల టన్నుల మేర : కాకులమాను యార్డ్‌ వద్ద 20 సంవత్సరాలుగా పేరుకుపోయిన 2.50 లక్షల టన్నుల వ్యర్థాలు తిరుమల వాతావరణాన్ని కలుషితం చేసేవి. వాటిని తొలగించడానికి టీటీడీ నూతన పాలకులు, అధికారులను సమాయత్తం చేశారు. ప్రత్యేకంగా కాంట్రాక్టర్‌ను ఏర్పాటు చేశారు. గత నవంబర్​లో ఈ పనులు ప్రారంభించగా, ఇప్పటివరకు రెండు లక్షల టన్నులు తొలగించారు. మిగిలిన 50,000ల టన్నులను వీలైనంత త్వరగా తరలించనున్నారు.

యార్డ్‌లోని వ్యర్థాల తరలింపు, నిర్వహణపై టీటీడీ డీఆర్‌డీఓ సహకారాన్ని కోరింది. ఇటీవలే డీఆర్‌డీఓ మాజీ ఛైర్మన్, రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు డా.సతీష్‌రెడ్డితో కలిసి టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు స్థానిక యార్డును పరిశీలించారు. నిపుణుల పరిశీలన అనంతరం సమగ్ర ప్రతిపాదనలు టీటీడీకి అందజేసేందుకు డీఆర్‌డీఓ సిద్ధమైంది. దీంతోపాటు తిరుమలలో ఏరోజు చెత్తను ఆ రోజే వేరుచేసి తరలించే విధానాన్ని ప్రతిపాదించనున్నారు.

బయోగ్యాస్‌ ఉత్పత్తి ప్రణాళిక : కాకులమాను తిప్ప వద్ద 2.2 ఎకరాల్లో రూ.12.85 కోట్లతో బయోగ్యాస్‌ ప్లాంట్‌ను ఐఓసీఎల్‌ నిర్మిస్తోంది. అనుబంధంగా కంపోస్టు నిల్వ కేంద్రం 0.17 ఎకరాల్లో ఏర్పాటు కానుంది. దీనిద్వారా రోజుకు 40 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో బయోగ్యాస్‌ ప్లాంట్ పనిచేస్తుంది. ఆగస్టుకల్లా నిర్మాణం పూర్తిచేసి, రెండున్నర కిలోమీటర్ల దూరంలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి పైపులైన్‌ ద్వారా బయోగ్యాస్‌ సరఫరా చేయనున్నారు.

వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తికి ప్లాంట్ల ఏర్పాటు

అనంతవాసులకు 'చెత్త' కష్టాలు - వ్యాధుల భయంతో స్థానికులు

ABOUT THE AUTHOR

...view details