Three Missing Persons in Polavaram Right Canal :ఏలూరు జిల్లాలో దవేగి మండలం కవ్వగుంట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పెదవేగి మండలం కవ్వగుంట వద్ద పోలవరం కుడికాల్వలో ముగ్గురు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు మృతి చెందారు. మరోకరి కోసం కోసం గాలింపు చర్యలు కొనసాగతున్నాయి. స్థానికుల సమాచారంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే,
కోడి పందేలకు సిద్ధం చేస్తున్న కోళ్లకు ఈత నేర్పించేందుకు తండ్రి వెంకటేశ్వర రావు తన ఇద్దరు కుమారులు మణికంఠ, సాయికుమార్తో కలిసి పోలవరం కుడి కాలువలో దిగారు. కోడికి ఈత నేర్పే క్రమంలో కుమారులు కొట్టుకుపోతుండగా తండ్రి వెంకటేశ్వరరావు వారిని కాపాడే ప్రయత్నంలో నీళ్లలో గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు కాలువలో గాలింపు చేపట్టగా తండ్రి పెద్ద కుమారుడు మణికంఠ మృతదేహాలు లభ్యమయ్యాయి. చిన్న కుమారుడు సాయికుమార్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దసరా పండుగ రోజుల్లో ఒకే ఇంట్లో ఇద్దరు మృత్యువాత పడటం, మరొకరు గల్లంతవ్వడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.