Chhattisgarh Encounters : భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన మూడు మందు పాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పూసుగుప్ప అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మూడుచోట్ల బీరు సీసాల్లో మందు పాతర (ఐఈడీ-ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్)లను అమర్చారు. కూంబింగ్కు వెళుతున్న భద్రతా బలగాలు మందుపాతరలను గుర్తించి వెలికితీసి నిర్వీర్యం చేశాయి. చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
దీనికి కారణం తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో ప్రతిరోజు మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య తీవ్ర పోరాటం కొనసాగుతోంది. కాగా గత నెల సెప్టెంబర్లో దండకారణ్యంలో 30 మందికి పైగా మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. వీరిలో అగ్రనాయకత్వం ఉన్నట్లు కూడా తెలిసింది. ఒక్కొక్కరి తలపై రివార్డు కూడా ఉంది. దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మావోయిస్టుల వ్యూహాలు మాత్రం ఫలించడం లేదు.
ఆపరేషన్ కగార్ : ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు కేంద్ర బిందువైన అబూజ్మడ్ ప్రాంతాన్ని భద్రతా బలగాలు టార్గెట్ చేశాయి. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను శాశ్వతంగా 2026 సంవత్సరం నాటికి నిర్మూలించడానికి భద్రతా బలగాలు అడవుల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకొన్నారు.
'ఆపరేషన్ చేయూత' ఎఫెక్ట్ - లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులు - six Maoist Members Surrender