ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తలసేమియా బాధితులకు అండగా NTR ట్రస్ట్ - విజయవాడలో తమన్‌ మ్యూజికల్ నైట్ - THAMAN MUSICAL NIGHT

ఫిబ్రవరి 15న తమన్‌ మ్యూజికల్ నైట్​కు సీఎం చంద్రబాబు - పవన్ కల్యాణ్‌ను ఆహ్వానిస్తామన్న భువనేశ్వరి

Thaman Musical Night in Vijayawada
Thaman Musical Night in Vijayawada (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 21, 2025, 5:40 PM IST

Updated : Jan 21, 2025, 9:18 PM IST

Thaman Musical Night in Vijayawada: తలసేమియా బాధితులకు అండగా నిలిచే లక్ష్యంతో విజయవాడ వేదికగా యుఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నట్టు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్​లో ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్, ట్రస్ట్ సీఈఓ రాజేంద్ర పాల్గొన్నారు. ఫిబ్రవరి 15న ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో ఈ కన్సర్ట్ ని నిర్వహించనున్నారు.

తమన్ ఆధ్వర్యంలో ప్రముఖ డ్రమ్స్ ప్లేయర్ శివమణి సహా దాదాపు 50 మంది కళాకారులు యుఫోరియాలో ఆడిపాడి ఆకట్టుకోనున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు లక్ష మంది పాల్గొంటారని అంచనా. బుక్ మై షో లో టికెట్స్ అందుబాటులో ఉన్నాయని ఈ సందర్బంగా పేర్కొన్న నారా భువనేశ్వరి, ఈ షో ద్వారా వచ్చిన డబ్బుని తలసేమియా కేంద్రాల ఏర్పాటుకు వినియోగిస్తామన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా వస్తారని పేర్కొన్న భువనేశ్వరి, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి ప్రముఖులు కూడా కుటుంబ సమేతంగా టికెట్స్ బుక్ చేసుకుని తలసేమియా బాధితులకు అండగా నిలవాలని కోరారు.

మహిళలకు వివిధ రంగాల్లో ఉచిత శిక్షణ - కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతం చేస్తా: నారా భువనేశ్వరి

ఎన్టీఆర్ ట్రస్ట్​ భవన్​లో మెగా హెల్త్ క్యాంప్​ - చిన్నారులకు బహుమతులు పంచిన నారా బ్రహ్మణి - నారా బ్రహ్మణి

Last Updated : Jan 21, 2025, 9:18 PM IST

ABOUT THE AUTHOR

...view details