Telangana fake Passport Case Update : నకిలీ పత్రాలతో పాస్పోర్ట్లు సృష్టించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు నకిలీ పత్రాలతో పాస్పోర్ట్ జారీకి సహకరించిన స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ లక్ష్మణ్ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 14 మందిని అరెస్ట్ చేశారు. ఏఎస్ఐ లక్ష్మణ్ ప్రస్తుతం నిజామాబాద్ పోలీస్ కమిషరేట్ పరిధిలోని నవిపేట్, మాక్లూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. తదుపరి విచారణ కొరకు సీఐడీ అధికారులు హైదరాబాద్కు తరలించారు.
ఫేక్ సర్టిఫికేట్లతో విదేశీయులకు భారత పౌరుల పాస్పోర్టులు (Fake Passports) ఇప్పించి గల్ఫ్ దేశాలకు పంపిస్తున్న ముఠా గురించి తెలిసిన విషయమే. దీనిపై విచారణ ప్రారంభించిన సీఐడీ విభాగం ప్రాథమిక దర్యాప్తులో హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, కోరుట్లలో ఈ దందా జరిగినట్లు గుర్తించింది. నకిలీ సర్టిఫికెట్లతో పాస్పోర్టులను సృష్టించడం ద్వారా 92మందిని భారతీయులుగా దేశం దాటించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో అబ్దుల్ సత్తార్ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు.
నకిలీ పాస్పోర్టు కేసు - వారిని దేశం దాటనీయకుండా సీఐడీ నిఘా
Telangana Fake Passport Scam Update : విజిటింగ్ వీసాలతో థాయిలాండ్, కెనడా, మలేషియా, ఇరాక్, దుబాయ్, స్పెయిన్, ఫ్రాన్స్ వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఆయా దేశాల్లో భారతీయ పౌరులుగా విదేశీయులు చలామణి అవుతున్నారని పేర్కొంది. జగిత్యాల, ఫలక్నుమాలోని చిరునామాలతో ఎక్కువగా పాస్పోర్టులను తీసుకున్నారని దర్యాప్తులో తేలిందని చెప్పారు.