Sri Lakshmi Tirupatamma Kalyanostavam in Penuganchiprolu of NTR District:ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి కల్యాణోత్సవం మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై తిరుపతమ్మ గోపయ్య స్వాముల విగ్రహాలను ఉంచి అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారి వంశీయులు కాకాని వల్ల కొల్ల వారి దంపతులు పీటలపై కూర్చొని కల్యాణం తంతు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేసి కళ్యాణంలో పాల్గొన్నారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీలలో వేలాదిమంది కూర్చొని కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. సుమారు లక్ష మంది భక్తులు హాజరయ్యారు. ఈ కళ్యాణోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను విజయవాడ డీసీపీలు గౌతమి శాలి, మహేశ్వర రాజు ఆధ్వర్యంలో పర్యవేక్షించారు.