తెలంగాణ

telangana

ETV Bharat / state

సికింద్రాబాద్ నుంచి కుంభమేళాకు 180 ప్రత్యేక రైళ్లు - టైమింగ్స్ తెలుసా? - MAHAKUMBHMELA 2025 SPECIAL TRAINS

మహాకుంభమేళాకు వేల సంఖ్యలో ట్రైన్స్ నడుపుతున్న రైల్వే శాఖ - తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం 180 ప్రత్యేక సర్వీసులు - సమాచారం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన రైల్వే సీపీఆర్వో శ్రీధర్

Mahakumbhmela 2025
SPECIAL TRAINS FOR KUMBHMELA (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2025, 5:13 PM IST

Special Trains From secunderabad to KumbhMela 2025: మహకుంభ మేళాకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం భారతీయ రైల్వే 13వేలకు పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఈ రైళ్లను అందుబాటులో ఉంచినట్లు రైల్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా 10 వేల రెగ్యులర్ సర్వీసులు, వాటికి అదనంగా మరో 3,100 ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.

దక్షిణ మధ్య రైల్వే జోన్ 142 ప్రత్యేక సర్వీసులు, ఇతర జోన్​ల నుంచి దక్షిణ మధ్య రైల్వే జోన్ మీదుగా మరో 40 రైళ్లను నడిపిస్తుంది. ఇక కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. కుంభమేళా ప్రత్యేక రైళ్లపై దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వోతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

"మహాకుంభమేళాను పురస్కరించుకుని భారతీయ రైల్వే ఇప్పటి వరకు 13వేల పైచిలుకు రైళ్లను నడుపుతుంది. దీనిలో 10వేల రెగ్యులర్ ట్రైన్స్​కు తోడు 3వేల స్పెషల్ రైళ్లను ప్రయాగ్​రాజ్ లాంటి చుట్టు పక్కలా స్టేషన్స్​కి ప్లాన్ చేశాం. ఇందులో భాగంగానే దిల్లీ, కోల్​కత్తా, పాట్నా, ముంబయి, సికింద్రాబాద్, బెంగళూరు వంటి వాటి నుంచి సిద్ధం చేయడం జరిగింది" -శ్రీధర్, సీపీఆర్వో, సౌత్​ సెంట్రల్​ రైల్వే

మహాకుంభమేళా పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో రైళ్లు : కుంభమేళాకు దేశవ్యాప్తంగా సుమారు కోటి నుంచి రెండు కోట్ల భక్తులను చేరవేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు సౌత్​ సెంట్రల్​ రైల్వే సీపీఆర్వో శ్రీధర్ వెల్లడించారు. ఇవే కాకుండా ఐఆర్​సీటీసీ తరఫున 'మహాకుంభమేళా పుణ్యక్షేత్ర యాత్ర' పేరుతో 2 భారత్ గౌరవ్​ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఒకటి జనవరి 19న బయలుదేరగా, మరోకటి ఫిబ్రవరి 15న సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుందని ఆయన చెప్పారు.

దీనిని పూర్తిగా ఐఆర్​సీటీసీ ప్యాకేజీ కింద నడుపుతున్నట్లు తెలిపారు. ఇవి మూడు కేటగిరీలలో ఉంటాయన్నారు. ఆలయ దర్శనంతో పాటు పుణ్య స్నానాలు కూడా చేయిస్తారని తెలిపారు. వాటిలో భక్తులు ఉండేందుకు మంచి నాణ్యమైన సౌకర్యాలతో వసతులుంటాయని పేర్కొన్నారు

సికింద్రాబాద్‌ నుంచి మహా కుంభమేళాకు స్పెషల్ ట్రైన్ - టికెట్ ధర ఎంతో తెలుసా?

ప్రయాణికులకు విజ్ఞప్తి : జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు

ABOUT THE AUTHOR

...view details