ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లాలో విషాదం - కరెంట్​ షాక్​తో నలుగురు మృతి - ELECTRIC SHOCK INCIDENT PEDAKAKANI

పెదకాకాని కాళీ గార్డెన్స్ రోడ్డులో విషాదం - గోశాల వద్ద విద్యుదాఘాతంతో నలుగురు మృతి

Electric Shock Incident in Pedakakani
Electric Shock Incident in Pedakakani (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 24, 2025, 6:07 PM IST

Electric Shock Incident in Pedakakani : గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెదకాకాని కాళీ గార్డెన్స్ రోడ్డులో ఉన్న ఓ గోశాలలో విద్యుదాఘాతంతో నలుగురు మృతిచెందారు. సంపులో పూడికను తొలగించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాళీ గార్డెన్స్ రోడ్డులో ఓ గోశాల ఉంది. అక్కడి నుంచి విడుదలయ్యే వ్యర్థాలను పక్కనే ఉన్న సంపుల్లోకి పంపిస్తారు. ఆ నీటిని చుట్టుపక్కన ఉన్న పొలాలకు మళ్లించి పంటలు సాగు చేస్తారు.

అయితే వ్యర్థాలు పేరుకుపోవడంతో సంపు మోటర్ నుంచి నీరు రావడం లేదు. దీంతో గోశాల సూపర్​వైజర్ మందడి శివరామ కాలిబాబు కొందరు కూలీలను పిలిపించి సంపులో పూడిక తీసే పనులు చేపట్టారు. వారు లోపలికి దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా మోటారుకు విద్యుత్ ప్రసారమైంది. ఈ నేపథ్యంలోనే ఓ కూలీకి షాక్ కొట్టింది. అతడిని కాపాడే క్రమంలో మిగతావారు విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు. దీనిపై సమాచారం అందుకున్న పెదకాకాని సీఐ నారాయణస్వామి ఘటనాస్థలికి చేరుకున్నారు.

Pedakakani Goshala Tragedy Incident : మృతులు గోశాల సూపర్​వైజర్​ శివరామ కాలిబాబుతో పాటు కూలీలు ఏకుల రాజేష్, గందాల మహంకాలిరావు, యాదగిరి బాలయ్యగా పోలీసులు గుర్తించారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా సంపు లోపలకు దిగడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విగతజీవులుగా పడి ఉన్న తమవారిని చూసి మృతుల కుటుంబసభ్యులు రోదించిన తీరు అక్కడి వారిని కలిచివేసింది.

వేటగాళ్ల ఉచ్చుకు బలైన సీఆర్ఫీఎఫ్ ఏఎస్సై - సిబ్బంది అప్రమత్తమైనా దక్కని ప్రాణాలు - CRPF ASI died due to Electric Shock

ABOUT THE AUTHOR

...view details