ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'స్మార్ట్​ఫోన్లూ లేవు' - ఎన్యుమరేటర్లకు చుక్కలు చూపిస్తున్న జనం - SAMAGRA KUTUMBA SURVEY

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే - ఇప్పటికీ పలు వివరాలు చెప్పేందుకు సిద్ధపడని ప్రజలు

Samagra_Kutumba_Survey
Samagra Kutumba Survey (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 20, 2024, 7:58 PM IST

Updated : Nov 20, 2024, 8:47 PM IST

Samagra Kutumba Survey in Telangana : తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే వేగంగా సాగుతోంది. కొన్ని చోట్ల ఎన్యుమరేటర్లు అడిగిన ప్రశ్నలన్నింటికీ కొందరు సమాధానాలు చెప్పగా, చాలా మంది తాము అసలు సమాధానాలు చెప్పం అనే విధంగా మాట్లాడుతున్నారు. మరోవైపు సర్వేలో ఫ్రిజ్​లు, టీవీలు, ఏసీలు, బైక్​ల గురించి వివరాలు వెల్లడిస్తే ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని సోషల్​ మీడియా విపరీతమైన ట్రోలింగ్స్​ జరుగుతున్నాయి. కానీ వారం రోజుల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్​ ఇచ్చిన ప్రకటనతో, వాటి ఇన్ఫర్మేషన్​ ఇచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వ పథకాలు ఆగిపోవని తెలిపారు. అయినా కూడా ఇంకా చాలా మంది పూర్తి సమాచారం ఇవ్వటం లేదని ఎన్యుమరేటర్లు చెబుతున్నారు.

ముఖ్యంగా స్థిర, చరాస్తుల వివరాలు చెబితే తమకు ప్రభుత్వ పథకాలు ఇవ్వరేమోననే భయంతో చెప్పడం లేదు. అలాగే ద్విచక్ర వాహనాలు, కార్లు, టీవీలు, ట్రాక్టర్లు, స్మార్ట్​ఫోన్లు ఉన్నా లేవంటూ ఎన్యూమరేటర్లను పక్కదారి పట్టిస్తున్నారు. ఈ వివరాలు ఇచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు, ప్రభుత్వం చెప్తున్నా సరే వినిపించుకోవడం లేదు. ఈ విషయంపై ఇప్పటికే మంత్రి సైతం క్లారిటీ ఇచ్చినా, కొందరు మాత్రం వినడం లేదు.

సర్వేకోసం వెళ్తే కుక్కలను ఉసిగొల్పారు! - ఆపసోపాలు పడుతున్న ఎన్యూమరేటర్లు

ఉపాధి కోసం వేరే ప్రాంతాల్లో ఉంటున్న వారు అయితే తమ వివరాలను సొంత గ్రామాలలోనే ఇస్తామంటూ సర్వేను దాటవేస్తున్నారు. దీంతో సర్వేకు సహకరించని వారి నుంచి సంతకం తీసుకుంటున్నామని ఎన్యుమరేటర్లు చెబుతున్నారు. ఇప్పుడు ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. ప్రభుత్వం, అధికారులు ఎంత చెప్పినా ప్రజలు వినకపోవడంతో సమగ్ర కుటుంబ సర్వేలో రోజూ తక్కువ శాతం నమోదవుతోంది. తక్కువ శాతం నమోదవుతున్న చోట్ల ప్రత్యేక సిబ్బందిని పంపించి ప్రక్రియ వేగవంతం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

కొన్ని చోట్ల చిరునామాలు మిస్​ : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈనెల 26 నాటికి సర్వేను పూర్తి చేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి సర్వే జరుగుతున్న తీరును ఎప్పుటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అలాగే సిబ్బందికి అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఒక్కో ఇంట్లో 75 అంశాలను ప్రశ్నించి, వివరాలు సేకరించాలి. కానీ కొన్ని చోట్ల కుటుంబ యజమానుల నుంచి సహకారం ఉండట్లేదు. సర్వేకు వెళ్లినప్పుడు ఇంటి వద్ద ఎవరూ లేకపోవటంతో పాటు, తొలుత ఒకే కుటుంబంగా నమోదు చేసుకున్నప్పటికీ వేర్వేరుగా వివరాలు తీసుకోవాలని కోరుతున్నారు. కొన్ని చోట్ల ఇంటి అడ్రస్ సరిగ్గా లేకపోవడంతో సర్వేలో కొంతమేర జాప్యం జరుగుతోంది.

"ఆ ఒక్కటీ తప్ప!" - ఇంటింటా అదే సమస్యతో సతమతం

Last Updated : Nov 20, 2024, 8:47 PM IST

ABOUT THE AUTHOR

...view details